BJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులతో సునీల్ బన్సల్ సమావేశం
ABN , First Publish Date - 2022-10-02T16:26:59+05:30 IST
జాతీయ కార్యవర్గ సభ్యులతో బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ సునీల్ బన్సల్ ఆదివారం సమావేశమయ్యారు.
హైదరాబాద్: జాతీయ కార్యవర్గ సభ్యులతో బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ సునీల్ బన్సల్ (Sunil bansal) ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి లక్ష్మణ్ (Laxman), కార్యవర్గసభ్యులు ఈటల(Etela rajender), వివేక్ (Vivek), గరికపాటి (Garikapati), ఇంద్రసేనారెడ్డి (Indrasena reddy), జితేందర్ రెడ్డి(Jitender reddy), విజయశాంతి (Vijayashanti) హాజరవగా... బండి సంజయ్ (Bandi sanjay) కరీంనగర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. వరస సమావేశాలతో శనివారం సునీల్ బన్సల్ (BJP is in charge of Telangana) బిజీగా గడిపారు. బీజేపీ స్టీరింగ్ కమిటీ, మండల ఇంచార్జ్లతో, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటితో బన్సల్ సమీక్ష జరిపారు. మునుగోడు పరిస్థితులపై రాత్రి అమిత్ షా (Amith shah)కు రాష్ట్ర ఇంచార్జ్ వివరించారు. దీంతో కార్యవర్గ సభ్యులతో సమావేశం కావాలని అమిత్ షా (Union minister) ఆదేశించారు. షా ఆదేశాలతో మునుగోడు ఉప ఎన్నికపై జాతీయ కార్యవర్గ సభ్యులకు బన్సల్ పలు సూచనలు చేశారు.