ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి
ABN , First Publish Date - 2022-09-13T05:30:00+05:30 IST
ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి
అసెంబ్లీలో ఎమ్మెల్యే సీతక్క
ములుగు, సెప్టెంబరు 13: ఆరు ఏజెన్సీ మండలాలకు కేంద్రంగా ఉన్న ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన సీతక్క ప్రజలకు పాల నను అందుబాటు లోకి తీసుకొచ్చేం దుకు ఏటూరునాగారాన్ని డివిజన్ చేయాలని, ప్రజల ఆకాంక్ష మేరకు ములుగు మండలంలోని మల్లంపల్లి, మంగపేట మండలంలోని రాజుపేట లను మండలాలుగా గుర్తించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ఆర్టీసీ బస్డిపోను సత్వరమే ఏర్పాటు చేయడంతోపాటు ములుగు, ఏటూరునాగారంలో మోడల్ బస్స్టేషన్లను నిర్మించాలని అన్నారు. జిల్లాకు మంజూరైన కలెక్టరేట్ భవనాన్ని యుద్ధప్రాతిపదికన నిర్మించాలని కోరారు. దీనిపె ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.