ఆ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వం బడులు: satyavathi rathod
ABN , First Publish Date - 2022-05-24T21:44:38+05:30 IST
ఆ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వం బడులు: satyavathi rathod
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం వచ్చినా తర్వాత బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువు కోసం కృషి చేస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రైవేట్ స్కూలుకు పోటీగా ప్రభుత్వం బడులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఐఐటీ, ఐఐఎం శిక్షణ ఇస్తామన్నారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాన్ని సాధ్యమైనత త్వరగా నిర్మిస్తామన్నారు. జిల్లాను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.