రూ. ఆరుకోట్ల విలువైన గంజాయి దగ్ధం
ABN , First Publish Date - 2022-08-17T08:22:22+05:30 IST
సూర్యాపేటలో రూ.6కోట్లకు పైగా విలువైన గంజాయిని దగ్ధం చేసినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
చివ్వెంల, ఆగస్టు 16: సూర్యాపేటలో రూ.6కోట్లకు పైగా విలువైన గంజాయిని దగ్ధం చేసినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలల కాలంలో 48 కేసుల్లో 12క్వింటాళ్ల 50కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.6కోట్లకు పైగా ఉంటుందని అటవీ ప్రాం తంలో గంజాయిని తగులబెట్టినట్లు వివరించారు.