REVANTHREDDY : బీజేపీవి విభజన రాజకీయాలు
ABN , First Publish Date - 2022-12-13T03:20:39+05:30 IST
బ్రిటిష్ పాలకుల మాదిరిగా బీజేపీ ఎల్లప్పుడూ విభజించి పాలించే రాజకీయాలు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు.
ట్విటర్లో రేవంత్రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్: బ్రిటిష్ పాలకుల మాదిరిగా బీజేపీ ఎల్లప్పుడూ విభజించి పాలించే రాజకీయాలు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. భాష, ఆహారం, కులం, మతం ప్రాతిపదికన దేశ ప్రజలను విభజిస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విభజన పదజాలాన్ని వాడటం విచారకరమంటూ రేవంత్ ట్వీట్ చేశారు. మరోవైపు అరచేతిలో వైకుంఠం చూపించడంలో సీఎం కేసీఆర్ ఆరితేరిపోయారని రేవంత్ ఆరోపించారు. ఒక్క వాసాల మర్రేమిటి..!ఆయన మాటలతో తెలంగాణ మొత్తం మోసపోయిందని పేర్కొన్నారు. ఆ మాటలు వినీవినీ ప్రజలు విసిగిపోయారన్నారు.