చికిత్స పొందుతూ కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2022-12-02T00:17:35+05:30 IST
మేనేజర్ వేధింపులు తాళలేక ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న కార్మికుడు తిరుమలేష్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు.
చౌదరిగూడ, డిసెంబరు 1: మేనేజర్ వేధింపులు తాళలేక ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న కార్మికుడు తిరుమలేష్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. లచ్చంపేట్ గ్రామానికి చెందిన తిరుమలేష్ 5 సంవత్సరాలుగా లాల్పహాడ్లోని బిస్కెట్ పరిశ్రమలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. జూలైలో పరిశ్రమలోని మిషన్లో చేతివేళ్లు తెగిపోవడంతో చికిత్స అనంతరం కంపెనీ మేనేజర్ డబ్బులు చెల్లిస్తానని చెప్పి ఇవ్వలేదు. ఎన్నిసార్లు డబ్బులు అడిగినా మేనేజర్ బెదిరించి దురుసుగా మాట్లాడడంతో తిరుమలేష్ మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో నవంబరు 27న ఒంటిపై పెట్రోల్ పోసకొఒని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఉస్మానియాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరుమలేష్ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.