అంకుషాపూర్ను సందర్శించిన లద్దాక్, లేహ జిల్లాల మహిళా సర్పంచ్లు
ABN , First Publish Date - 2022-12-12T23:21:07+05:30 IST
కేంద్రపాలిత ప్రాంతం లద్దాక్, లేహ జిల్లాలకు చెందిన 30 మంది మహిళా సర్పంచ్ల బృందం సోమవారం ఘట్కేసర్ మండలంలోని అంకుషాపూర్ పంచాయతీని సందర్శించారు. పంచాయతీ నిర్వహణ గురించి డీఎల్పీవో స్మిత వారికి వివరించారు.
ఘట్కేసర్ రూరల్, డిసెంబరు 12 : కేంద్రపాలిత ప్రాంతం లద్దాక్, లేహ జిల్లాలకు చెందిన 30 మంది మహిళా సర్పంచ్ల బృందం సోమవారం ఘట్కేసర్ మండలంలోని అంకుషాపూర్ పంచాయతీని సందర్శించారు. పంచాయతీ నిర్వహణ గురించి డీఎల్పీవో స్మిత వారికి వివరించారు. అనంతరం గ్రామంలోని నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్యార్డు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. డ్వాక్రా మహిళా సంఘాల నిర్వహణ, రుణం, ఆదాయం, చెల్లింపులు, మహిళల స్వయం ఉపాధిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో దేవసహాయం, ఎంపీపీ సుదర్శన్రెడ్డి, ఎంపీడీవో అరుణ, సర్పంచ్ కొమ్మిడ జలజా సత్యనారాయణరెడ్డి, ఎంపీవో నందకిశోర్, ఉపసర్పంచ్ చింతకింది బాలమణి, మాజీ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, ఎన్ఐఆర్డీ అధికారులు హేమంత్, శశికళ, వార్డుసభ్యులు పాల్గొన్నారు.