కార్యకర్తలకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2022-12-10T00:15:21+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం
బాధిత కుటుంబానికి చెక్కును అందజేస్తున్న రేవంత్‌రెడ్డి

షాబాద్‌, డిసెంబరు 9: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తాళ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త మంగలి వెంకటేష్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇన్సురెన్యూ నుంచి రూ.2లక్షల చెక్కును రేవంత్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌, సుభాష్‌, మాణిక్యం, కృష్ణ, శ్రీకాంత్‌, మహేష్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:15:22+05:30 IST