మన ఊరు- మన బడి పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-11-30T23:20:00+05:30 IST

మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ నిఖిల సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

మన ఊరు- మన   బడి పనులు వేగవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌, నవంబరు 30: మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ నిఖిల సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో మనఊరు-మనబడి పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ. జిల్లాలో మొదటి విడతగా మంజూరైన 37 పాఠశాలల్లో ఎన్‌. ఆర్‌ఈజీఎస్‌ కింద చేపట్టిన ప్రహరీలు, కిచెన్‌షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు ఇతర పనులన్నీ పూర్తి చేసి పాఠశాలలకు కలరింగ్‌ పనులు చేపట్టి అందంగా తీర్చిదిద్దాలన్నారు. మిగిలి ఉన్న పనులకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, పరిపాలనాపరమైన అనుమతులు, గ్రౌండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకుక ఈఈలు, డీఈలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని అన్నారు. డిసెంబర్‌ 15 నాటికి అన్ని హంగులతో పాఠశాలలను సుందరీకరించి ప్రారంభోత్సవాలకు సిద్ధ్దం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, జిల్లారెవెన్యూ అధికారి అశోక్‌కుమార్‌, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, డీఆర్‌డీవో కృష్ణన్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ ఇరిగేషన్‌, టీఎస్‌ ఈడబ్ల్యూఐడీసీ శాఖల ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:20:02+05:30 IST