చలి పంజా

ABN , First Publish Date - 2022-11-21T00:15:05+05:30 IST

ఉమ్మడి జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. రోజు రోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

చలి పంజా

వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో కనిష్ఠంగా 8.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు

రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 9.2 డిగ్రీలు.. మేడ్చల్‌ జిల్లా భాగ్యనగర్‌లో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 20: ఉమ్మడి జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. రోజు రోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రతకు చా లామంది ఉదయం 9గంటల వరకు బయటకు రావడం లేదు. సాయంత్ర 6గంటల తర్వాత చలిగాలులు వీస్తున్నాయి. చలి కారణంగా సీజనల్‌, శ్వాసకోశ సంబంధ వ్యాధులబారిన పడుతున్నారు. నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రత పడిపోతున్నాయి. ఆదివారం వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 8.2కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 9.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మేడ్చల్‌ జిల్లాలో 11.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రతతో జనం ఉదయం, సాయంత్రం చలి మంటలు కాచుకుంటున్నారు.

Updated Date - 2022-11-21T00:15:06+05:30 IST