రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న వంశీచంద్రెడ్డి
ABN , First Publish Date - 2022-09-10T05:59:19+05:30 IST
రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న వంశీచంద్రెడ్డి
ఆమనగల్లు, సెప్టెంబరు 9: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం యాత్ర 2వ రోజు రాహుల్ వెంట పాదయాత్ర చేశారు. భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని వంశీచంద్రెడ్డి తెలిపారు.