సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి
ABN , First Publish Date - 2022-06-08T04:22:05+05:30 IST
మున్సిపాలిటీల్లోని సమస్యలను పరిష్కరించేందుకు
- తెలంగాణ పురపాలక సెక్రటరీ సుదర్శన్రెడ్డి
శంషాబాద్, జూన్ 7 : మున్సిపాలిటీల్లోని సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని తెలంగాణ పురపాలక సెక్రటరీ సుదర్శన్రెడ్డి అన్నారు. ఆయా మున్సిపాలిటీల్లోని ప్రజాప్రతినిధులంతా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 15,18,24 వార్డుల్లో జరుగుతున్న నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్తో కలిసి సుదర్శన్రెడ్డి తనిఖీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వైస్చైర్మన్ బండి గోపాల్యాదవ్, ఇంజనీర్ అనిల్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.