నేడు కాంగ్రెస్ పార్టీ విస్రృతస్థాయి సమావేశం
ABN , First Publish Date - 2022-05-19T05:28:45+05:30 IST
నేడు కాంగ్రెస్ పార్టీ విస్రృతస్థాయి సమావేశం
రంగారెడ్డి అర్బన్, మే 18 : గాంధీభవన్లోని డీసీసీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తెలిపారు. పార్టీ అధినేత రాహుల్గాంధీ వరంగల్లో చేపట్టిన రైతు డిక్లరేషన్పై నిర్వహించే ఈ సమావేశానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేముల నరేందర్, పార్టీనేతలు మల్లురవి, మల్రెడ్డి రంగారెడ్డి, కోదండరెడ్డి హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి టీపీసీసీ కార్యదర్శులు, పార్టీ మండల, మున్సిపల్, కార్పొరేషన్, డివిజన్ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎ్సయూఐ నాయకులు హాజరు కావాలని కోరారు.