కోట్‌పల్లి పోచమ్మ ఆలయంలో చోరీ

ABN , First Publish Date - 2022-12-12T23:49:30+05:30 IST

కోట్‌పల్లిలోని పోచమ్మ ఆలయంలో అమ్మవారి పుస్తెను ఆదివారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు.

కోట్‌పల్లి పోచమ్మ ఆలయంలో చోరీ

బంట్వారం(కోట్‌పల్లి), డిసెంబరు 12: కోట్‌పల్లిలోని పోచమ్మ ఆలయంలో అమ్మవారి పుస్తెను ఆదివారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... పోచమ్మ ఆలయ తాళంవిరగ్గొట్టి అమ్మవారి బంగారు పుస్తెను ఎత్తుకపోయారు. ఇప్పుడు పోచమ్మ ఆలయంలో, గతంలో శివాలయంలో చోరీ జరిగినా పోలీసులు దొంగలను పట్టుకోలేదని గ్రామస్తులు వాపోయారు. పోలీసులు ఆలయానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-12-12T23:49:31+05:30 IST