‘ ఎత్తిపోతల’ పనులు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-11-27T23:56:19+05:30 IST
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలని జలసాధన సమితి జిల్లా కో-కన్వీనర్ హెచ్.నర్సింహా అన్నారు.
బొంరా్సపేట్, నవంబరు 27 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలని జలసాధన సమితి జిల్లా కో-కన్వీనర్ హెచ్.నర్సింహా అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నాందర్పూర్ గ్రామంలో గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు, యువకులతో సంతకాలు చేయించి సీఎం కేసీఆర్, గవర్నర్, కేంద్ర జలశక్తి మంత్రికి పంపించారు. ప్రభుత్వం జీవో 69ను అమలు చేసి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో అమలయితే.. మక్తల్, ఊట్కూర్, ధన్వాడ, నారాయణపేట, దామర్గిద్ద, మద్దూర్, కోస్గి, బొంరా్సపేట్, దౌల్తాబాద్, కొడంగల్ మండలాల్లో లక్ష ఎకరాలకు సాగు, ప్రజలకు తాగునీరు అందించవచ్చని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటయ్య, సర్పంచ్ హరినాయక్, కిష్టప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.