నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2022-09-12T04:58:57+05:30 IST
నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ఘట్కేసర్ రూరల్, సెప్టెంబరు 11: రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్గౌడ్ అన్నారు. మండలంలోని అంకుషాపూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅథితిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హేమామాలిని, వైఎస్ ప్రిన్సిపాల్ మంజుల, నాయకులు మహిపాల్గౌడ్ పాల్గొన్నారు.