Chandrasekhar: ప్రజా సమస్యలు తెలుసుకోలేని సీఎం ఉండటం దౌర్భాగ్యం
ABN , First Publish Date - 2022-08-16T20:41:41+05:30 IST
వికారాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
వికారాబాద్ (Vikarabad): సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటన నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, ముందస్తు అరెస్టులు చేయడాన్ని బీజేపీ నేత, మాజీమంత్రి ఏ. చంద్రశేఖర్ (Chandrasekhar) ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ సమస్యలపై సీఎం కేసీఆర్కు వినతిపత్రం ఇస్తామంటే పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు తెలుసుకోలేని ముఖ్యమంత్రి ఉండటం ప్రజల దౌర్భాగ్యమన్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసుల అమానుష ప్రవర్తనను మరోసారి ఖండిస్తున్నానని చంద్రశేఖర్ అన్నారు.