విద్యార్థులు ప్రతిభను చూపాలి
ABN , First Publish Date - 2022-12-13T23:21:27+05:30 IST
పల్లె బడుల్లో చదివే విద్యార్థులు తమ ప్రతిభను చాటేందుకు జ్ఞాన సరస్వతీ ఫౌండేషన్ లాంటి సంస్థలు ఇచ్చే చేయూతను అందిపుచ్చుకోవాలని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు.
ఇబ్రహీంపట్నం, డిసెంబరు 13: పల్లె బడుల్లో చదివే విద్యార్థులు తమ ప్రతిభను చాటేందుకు జ్ఞాన సరస్వతీ ఫౌండేషన్ లాంటి సంస్థలు ఇచ్చే చేయూతను అందిపుచ్చుకోవాలని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. మంగళవారం ఆ సంస్థ ఆధ్వర్యంలో రూరల్ జీనియస్ -2023 పోస్టర్ను నగరంలో చుక్కా రామయ్య ఆవిష్కరించారు. జీఎ్సఎఫ్ వ్యవస్థాపకులు సదా వెంకట్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థికి అభిరుచి ఉన్న అంశాల్లో సింగింగ్, పెయింటింగ్, యోగా, స్పీచ్, కబడ్డీ, వాలీబాల్, స్టెమ్ అంశాల్లో 200 మందిని గుర్తించి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎ్సఎఫ్ సభ్యులు శ్రీనివా్సగౌడ్ నరేష్, ప్రమోద, శ్రీశైలం ఉన్నారు.