విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి
ABN , First Publish Date - 2022-11-27T23:58:04+05:30 IST
విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని, జీవిత లక్ష్య సాధన కోసం ఆత్మస్తైర్యంతో ముందుకు సాగాలని వ్యక్తిత్వ వికాస నిపుణుడు,హరివిల్లు ఫౌండేషన్ సభ్యుడు మురహరినాథ్ అన్నారు.
పరిగి రూరల్, నవంబరు 27: విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని, జీవిత లక్ష్య సాధన కోసం ఆత్మస్తైర్యంతో ముందుకు సాగాలని వ్యక్తిత్వ వికాస నిపుణుడు,హరివిల్లు ఫౌండేషన్ సభ్యుడు మురహరినాథ్ అన్నారు. ఆదివారం పరిగిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రవీణ్, హరీశ్, ఘోరేపాషా, మల్లయ్య, నరేశ్, ఫయాజ్, రమేశ్, శ్రీధర్, అనిల్, హరివిల్లు ఫౌండేషన్ సభ్యులు ధర్మ, విద్యార్థులు పాల్గొన్నారు.