మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-02-20T04:45:35+05:30 IST
మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు
యాచారం, ఫిబ్రవరి 19: దుకాణదారులు మాదకద్రవ్యాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాచారం ఎస్సై ప్రభాకర్ హెచ్చరించారు. శనివారం మాల్, యాచారం తదితర గ్రామాల్లోని కిరాణ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి, యాష్కీ, గుట్కాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.