వణికిస్తున్న చలి

ABN , First Publish Date - 2022-11-30T23:32:14+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో చలితీవ్రత పెరిగింది. నగర శివార్లలో ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వణికిస్తున్న చలి

నగర శివార్లలో పెరిగిన చలి తీవ్రత

మంగల్‌పల్లిలో 8.6 కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, నవంబరు 30 : ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో చలితీవ్రత పెరిగింది. నగర శివార్లలో ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలో రాష్ట్రంలోనే 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే షాబాద్‌ మండలం తాళ్లపల్లిలో 8.7డిగ్రీలు, చౌదరిగూడెం కాసులాబాద్‌లో 9డిగ్రీలు, చేవెళ్ల మండలం కందవాడలో 9.2డిగ్రీలు, షాబాద్‌ మండలం చందన్‌వెల్లిలో 9.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలో నందనవనంలో 9.2డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌జిల్లాల్లో దాదాపు అన్ని మండలాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17డిగ్రీలోపే ఉండడం గమనార్హం. హైదరాబాద్‌ నగర శివార్లలో చలితీవ్రత ఒక్కసారిగా పెరగడంతో సాయంత్రం బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. దీంతో రాత్రివేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

Updated Date - 2022-11-30T23:32:15+05:30 IST