పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం
ABN , First Publish Date - 2022-12-02T00:11:42+05:30 IST
తిమ్మాయిపల్లి ప్రాఽథమిక పాఠశాలలో విద్యార్థులు గురువారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కందుకూరు, డిసెంబరు 1: తిమ్మాయిపల్లి ప్రాఽథమిక పాఠశాలలో విద్యార్థులు గురువారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాబోధనలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్థానిక సర్పంచ్ కాకి ఇందిరదశరథ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.హాసిని, జి.రాకేష్, డి.రాంచందర్, ఎ.మనోహర్, జి.అఖిల్ పాల్గొన్నారు.