ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

ABN , First Publish Date - 2022-11-25T00:03:02+05:30 IST

శీతాకాల పార్లమెంటు సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెస్పీ జిల్లా కో-ఇన్‌చార్జి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

ఎమ్మెస్పీ జిల్లా కో-ఇన్‌చార్జి రవికుమార్‌

తాండూరు, నవంబరు 24 : శీతాకాల పార్లమెంటు సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెస్పీ జిల్లా కో-ఇన్‌చార్జి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం తాండూరులో ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్పీ ముఖ్య కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసి సమావేశం నిర్వహించారు. రవికుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తున్నామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ రిజ ర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చి ఏనిమిదేళ్లు గడిచాయని, ఇప్పుడు వర్గీకరణ ఊసే ఎత్తకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఎమ్మెస్పీ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనకై మాదిగ ఉపకులాలంతా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాయకులు రాములు, శ్రీకాంత్‌, జిల్లా నాయకులు పుష్ప, మల్లికార్జున్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-11-25T00:03:03+05:30 IST