జాతీయస్థాయి సదస్సులో కడ్తాల్‌ సర్పంచ్‌

ABN , First Publish Date - 2022-09-14T05:10:45+05:30 IST

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో

జాతీయస్థాయి సదస్సులో కడ్తాల్‌ సర్పంచ్‌
సదస్సులో పాల్గొన్న సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి

కడ్తాల్‌, సెప్టెంబరు 13: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో మంగళవారం నిర్వహించిన జాతీయ సదస్సులో కడ్తాల సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి పాల్గొన్నారు. ‘పంచాయతీల ఆదాయ వనరుల పెంపు- స్థానిక సంస్థల బలోపేతం’ అనే అంశంపై రెండురోజులపాటు సదస్సు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-14T05:10:45+05:30 IST