ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్షం

ABN , First Publish Date - 2022-09-15T05:40:14+05:30 IST

ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్షం

ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్షం
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

  • రెండు వాహనాలను ఢీకొని చెట్టును గుద్దుకున్న బస్సు
  • 12 మందికి గాయాలు

కందుకూరు. సెప్టెంబరు 14: హైదరాబాద్‌ -శ్రీశైలం జాతీయ రహదారి బుధవారం దెబ్డగూడ గేటు వద్ద అచ్చంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ వస్తూ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా మేరకు.. దెబ్బడగూడ గేటు వద్ద బస్సు డ్రైవర్‌ దేవస్వామి అతివేగం, అజాగ్రత్తగా నడిపి ముందున్న కోళ్లవ్యాన్‌ను ఢీకొన్నాడు. మరో వ్యాన్‌నూ చివరగా వేప చెట్టును ఢీకొట్టాడు. బస్సు డ్రైవర్‌ దేవస్వామి, కండక్టర్‌ రాజు, కోళ్ల వ్యాన్‌ డ్రైవర్‌ మధు, ప్రయాణికులు మల్లయ్య, రాజేందర్‌, ఎల్లమ్మ, సుగుణ, పార్వతమ్మ, లక్ష్మణాచారి గాయపడ్డారు. వారిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొండల్‌ చెప్పారు. 

Updated Date - 2022-09-15T05:40:14+05:30 IST