రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2022-09-12T04:55:38+05:30 IST
రేషన్ బియ్యం పట్టివేత
దోమ, సెప్టెంబరు 11: మండలంలోని బాసుపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకొని స్టేషన్కు తరలించారు. భువనగిరి జిల్లా యాదాద్రి మండలానికి చెందిన ఽధీరావత్ రాజేశ్ బాసుపల్లి నుంచి బొలెరో వాహనంలో అక్రమంగా ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా గుర్తించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విశ్వజాన్ తెలిపారు.