వైభవంగా రథోత్సవం
ABN , First Publish Date - 2022-12-10T00:12:23+05:30 IST
రాంపూర్ శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
తలకొండపల్లి, డిసెంబరు 9: రాంపూర్ శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రథంపై ఉత్సవ విగ్రహాలను ఉంచి తాళ్లతో లాగి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మలశ్రీశైలం గౌడ్, సర్పంచ్ శ్యామ్సుందర్రెడ్డి, ఉపసర్పంచ్ మోహన్రెడ్డి, ఈవో మోహన్రావు, ఆలయ మాజీచైర్మన్ శ్రీశైలం యాదవ్, నాయకులు యాదయ్య, హరిమోహన్రెడ్డి, పాల్గొన్నారు.
శ్రీ నీలకంఠమేశ్వరస్వామి ఉత్సవాలు ప్రారంభం
యాచారం: నందివనపర్తిలోని శ్రీ నీలకంఠమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఆలయ నిర్వాహకులు హోమం నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మతల్లికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. శ్రీనీలకంఠమేశ్వర స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. శని, ఆదివారాల్లో బోనాల ఊరేగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పూజా కార్యక్రమాల్లో సర్పంచ్ ఉదయశ్రీ, బీఎన్రెడ్డి ట్రస్చైర్మన్ బిలకంటి శేఖర్రెడ్డి పాల్గొన్నారు.