అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ABN , First Publish Date - 2022-11-25T00:09:28+05:30 IST
చౌదరిగూడ మహిళా సమాఖ్యలో పనిచేస్తున్న సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జంగారెడ్డి అన్నారు.
చౌదరిగూడ, నవంబరు 24: చౌదరిగూడ మహిళా సమాఖ్యలో పనిచేస్తున్న సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జంగారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చౌదరిగూడ మండల కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రామస్వామి, సీసీలు రమేష్, దేవయ్య, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.