భక్తిశ్రద్ధలతో మహా పడిపూజ

ABN , First Publish Date - 2022-12-10T00:17:50+05:30 IST

మొయినాబాద్‌ మండలంలోని హిమయత్‌ నగర్‌ గ్రామానికి చెందిన బైకని కుమార్‌ యాదవ్‌ అయ్యప్ప మహా పడిపూజను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో మహా పడిపూజ
మొయినాబాద్‌ రూరల్‌: హిమయత్‌ నగర్‌లో నిర్వహించిన పడిపూజలో పాల్గొన్న స్వాములు

మొయినాబాద్‌ రూరల్‌/కడ్తాల్‌, డిసెంబరు 9: మొయినాబాద్‌ మండలంలోని హిమయత్‌ నగర్‌ గ్రామానికి చెందిన బైకని కుమార్‌ యాదవ్‌ అయ్యప్ప మహా పడిపూజను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. షాద్‌నగర్‌కు చెందిన శ్రీశ్రీశ్రీ సతీ్‌షనాయర్‌ నేతృత్వంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విజయభాస్కర్‌రెడ్డి, శివ శంకర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా గుడిమల్కాపూర్‌ ప్రాంతానికి చెందిన కేశవ్‌గురుస్వామి నిర్వహించిన పడిపూజ వైభవంగా నిర్వహించారు. అయ్యప్పస్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, వివిద పూలు పండ్లతో అలంకరణ చేసి పంచహారతులను సమర్పించిన అనంతరం పడిమెట్లపై కర్పూరహారతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో చిలూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల్‌ మండలంలోని ముద్విన్‌ గ్రామంలో శుక్రవారం అయ్యప్ప మహాపడి పూజ, ఇరుముడి కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గణపతి పూజ, అభిషేకాలు, పడిపూజ, ఇరుముడి కార్యక్రమాలు కొనసాగాయి. గంప లక్ష్మయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పీఏసీఎస్‌ చైర్మన్‌ గంప వెంకటేశ్‌, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశ్‌ ను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ యాదయ్య, ఎంపీటీసీ లచ్చిరామ్‌ నాయక్‌, నాయకులు స్వాములు జంగయ్య, శ్రీను, రాఘవ రెడ్డి, సతీష్‌, వెంకటయ్య, మల్లేశ్‌, రాములు, రామచంద్రి, నర్సింహ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:17:51+05:30 IST