ఏడుగురు బాల కార్మికులకు విముక్తి

ABN , First Publish Date - 2022-12-02T00:16:31+05:30 IST

పిల్లలతో పనులు చేయిస్తున్న ఓ సంస్థపై గురువారం అధికారులు దాడిచేసి అందులో పనిచేస్తున్న ఏడుగురు బాల కార్మికులకు విముక్తి కల్పించారు.

 ఏడుగురు బాల కార్మికులకు విముక్తి

ఆదిభట్ల, డిసెంబరు 1: పిల్లలతో పనులు చేయిస్తున్న ఓ సంస్థపై గురువారం అధికారులు దాడిచేసి అందులో పనిచేస్తున్న ఏడుగురు బాల కార్మికులకు విముక్తి కల్పించారు. ఆదిభట్ల ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం బాలపూర్‌ మండలం నాదర్‌గుల్‌ పరిధిలోని శ్రీ సాయిఫుడ్‌ సంస్థలో బాల కార్మికులతో పనులు చేయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు గురువారం ఆదిభట్ల పోలీసులు చైల్డ్‌లేబర్‌ అధికారులు సంయుక్తంగా దాడిచేసి అందులో పనిచేస్తున్న ఏడుగురు బాల కార్మికులను గుర్రంగూడలోని బాల సంరక్షణ కేంద్రానికి తరలించారు. శ్రీ సాయిపుడ్‌ సంస్థ యాజమాని అజిత్‌సింగ్‌పై కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-12-02T00:16:33+05:30 IST