కీసరగుట్ట ఆలయ హుండీ లెక్కింపు
ABN , First Publish Date - 2022-09-18T04:03:35+05:30 IST
కీసరగుట్ట ఆలయ హుండీ లెక్కింపు
200 రోజులకు రూ.24.24 లక్షల ఆదాయం
కీసర, సెప్టెంబరు 17 : కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయ హుండీని శనివారం అధికారులు లెక్కించారు. 200 రోజులకు గాను ఆలయంలోని హుండీలను తెరిచి లెక్కించారు. మొత్తం 24 లక్షల 24వేల 69 రూపాయలు వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహఽణాధికారి ఏవీ రవీందర్రెడ్డి, ఆర్చకులు, సిబ్బంది, శ్రీ భ్రమరాంబ సేవాసమితి, రాజరాజేశ్వరి సేవా సమితి, సద్గురు సేవా సమితి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.