దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2022-09-14T05:11:24+05:30 IST
కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళా శాలలో
కందుకూరు, సెప్టెంబరు 13 : కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసు కోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి కోరారు. కళాశాలలో జువాలజీ, కామర్స్ సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో 50శాతం మార్కులతో పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈనెల 16వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.