నిరుపేదలకు ఇళ్ల స్థలాలు చూపాలి

ABN , First Publish Date - 2022-12-10T00:24:20+05:30 IST

కందుకూరు రెవెన్యూలోని 788 సర్వే నెంబర్‌లో గల ప్రభుత్వ భూమిలోని నిరుపేదలకు ఇండ్ల స్థలాను చూపాలని సీపీఎం పార్టీ నేతలు శుక్రవారం తహసీల్దార్‌ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.

నిరుపేదలకు ఇళ్ల స్థలాలు చూపాలి
వినతి పత్రం ఇస్తున్న సీపీఎం నేతలు

కందుకూరు, డిసెంబరు 9 : కందుకూరు రెవెన్యూలోని 788 సర్వే నెంబర్‌లో గల ప్రభుత్వ భూమిలోని నిరుపేదలకు ఇండ్ల స్థలాను చూపాలని సీపీఎం పార్టీ నేతలు శుక్రవారం తహసీల్దార్‌ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. 15 ఏళ్ల క్రితం నిరుపేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాల పట్టాల ఆధారంగా పొజీషన్‌ చూపాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు డి.రాంచందర్‌, మండల నాయకుడు ఆర్‌.చందు, జి.సత్తయ్య డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-10T00:24:21+05:30 IST