డయాలసిస్‌ రోగులకు ప్రభుత్వం ఆసరా

ABN , First Publish Date - 2022-10-04T05:39:18+05:30 IST

డయాలసిస్‌ రోగులకు ప్రభుత్వం ఆసరా

డయాలసిస్‌ రోగులకు ప్రభుత్వం ఆసరా
డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛన్‌ కార్డులు పంపిణీ చేస్తున్న నరసింహారెడ్డి

మేడ్చల్‌ అర్బన్‌, అక్టోబరు 3: డయాలసిస్‌ రోగులకు సోమవారం  మేడ్చల్‌-మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డి ఆసరాపింఛన్‌ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి బారినపడి డయాలసిస్‌ చేయించుకునేందుకు బాధితులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా  వారికి ఆసరా పింఛన్‌ గుర్తింపు కార్డులను అందజేసి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. 

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

 ప్రజావాణిలో వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ (ఎల్‌బీ)జాన్‌శ్యాంసన్‌, డీఆర్వో లింగ్యానాయక్‌లతో కలిసి 13 అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలనుంచి వస్తున్న అర్జీలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలన్నారు.

Updated Date - 2022-10-04T05:39:18+05:30 IST