పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
మత పెద్దలతో మాట్లాడుతున్న డీఎస్పీ శేఖర్‌గౌడ్‌

తాండూరు, జూలై 3 : పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ సూచించారు. బక్రీద్‌ను పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం వెల్ఫేర్‌, మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లడుతూ హిందూ, ముస్లిం, క్రైస్తవులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. అన్ని పండుగలను ప్రశాంతంగా, శాంతియుతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. పండుగల వేళ, ఇతర సమయాల్లో కానీ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియాలో ఎవరైనా అసభ్యకర సందేశాలను, వీడి యోలు పెడితే నమ్మరాదన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలుంటాయని డీఎస్పీ హెచ్చరించారు.  సమావేశంలో సీఐలు రాజేందర్‌రెడ్డి, రాంబాబు, ముస్లింలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T05:30:00+05:30 IST