రైతులు ‘ఈకేవైసీ’ చేయించుకోవాలి

ABN , First Publish Date - 2022-12-02T00:10:24+05:30 IST

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా లబ్ధి పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఏవో వీరస్వామి తెలిపారు.

 రైతులు ‘ఈకేవైసీ’ చేయించుకోవాలి

కులకచర్ల, డిసెంబరు 1: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా లబ్ధి పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఏవో వీరస్వామి తెలిపారు. గురువారం చౌడాపూర్‌ మండల పరిధిలోని మందిపాల్‌ గ్రామంలో సర్పంచ్‌ మఠం ప్రమీల ఆధ్వర్యంలో పీఎంఈకేవైసీ మొబైల్‌ లింక్‌పై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన రైతులంతా పీఎం ఈకేవైసీ చేయించుకోవాలని, లేనియెడల పీఎం కిసాన్‌ పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమకావని చెప్పారు. కావున ఈకేవైసీ తప్పకుండా చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో విశ్వనాథ్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:10:25+05:30 IST