ప్రశాంతంగా ఎంసెట్e
ABN , First Publish Date - 2022-07-19T05:21:07+05:30 IST
ప్రశాంతంగా ఎంసెట్e
మొయినాబాద్ రూరల్/మేడ్చల్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన ఎంసెట్ పరీక్షలో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎంట్రెన్స్ ప్రశా తంగా ముగిసింది. మొయినాబాద్ మండలం అజీజ్నగర్ చౌరస్తాలోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల, ఆమ్డాపూర్ చౌరస్తాలోని జేబీఐఈటీ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేబీఐఈటీ కాలేజీలో ఉదయం 350, మధ్యాహ్న 350 మంది, విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 280, మధ్యాహ్నం 220మంది పరీక్ష రాశారని నిర్వాహకులు తెలిపారు. కళాశాలల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడి నెలకొంది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే నిజామాబాద్కు చెందిన ఓ విద్యార్థిని పరీక్షా కేంద్ర కోడ్ నెంబర్ను సరిగా గుర్తించక వేరొక సెంటర్లోకి వెళ్లి కూర్చుంది. పొరపాటును గుర్తించి తన సెంటర్కు 10నిమిషాలు ఆలస్యంగా వెళ్లడంతో లోనికి అనుమతించలేదు. దీంతో విద్యార్థిని విలపించింది.