ఆలయ నిర్మాణానికి విరాళం
ABN , First Publish Date - 2022-10-12T05:09:51+05:30 IST
ఆలయ నిర్మాణానికి విరాళం
షాద్నగర్ అర్బన్, అక్టోబరు 11: వెలిజర్ల గ్రామపంచాయతీలో గల ఎన్నెగడ్డ తండాలో నిర్మించతలపెట్టిన శ్రీ జగదాంబ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయానికి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్పరెడ్డి రూ.25వేలు విరాళంగా అందజేశారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుల కోరిక మేరకు మంగళవారం షాద్నగర్లోని తన కార్యాలయంలో విరాళాన్ని అందజేశారు.