పారిశుధ్య కార్మికులకు చీరల పంపిణీ
ABN , First Publish Date - 2022-09-12T05:09:44+05:30 IST
పారిశుధ్య కార్మికులకు చీరల పంపిణీ
షాద్నగర్ అర్బన్, సెప్టెంబరు 11: షాద్నగర్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికురాళ్లకు ఆవోపా రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ చీరలు పంపిణీ చేశారు. తన సతీమణి మలిపెద్ది సూజాత వైకుంఠ సమారాధనను పురష్కరించుకొని ఆదివారం కార్మికులందరికీ చీరలను ఇచ్చారు. 51మంది ముత్తయిదువులకు చాట వాయనం అందించి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.