అకాల వర్షంతో పాడైన పత్తిపంట
ABN , First Publish Date - 2022-12-12T23:16:08+05:30 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండన్ అల్పపీడన ప్రభావంతో మండల పరిధిలో మూడు రోజులుగా చిరు జల్లులు కురుస్తున్నాయి.
యాచారం, డిసెంబరు 12 : బంగాళాఖాతంలో ఏర్పడిన మాండన్ అల్పపీడన ప్రభావంతో మండల పరిధిలో మూడు రోజులుగా చిరు జల్లులు కురుస్తున్నాయి. దీంతో పత్తి పంట తడిసిముద్దయింది. పొలంలో తీయకుండా ఉన్న పత్తి వర్షానికి తడవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా యాచారం, చౌదర్పల్లి, నజ్దిక్సింగారం, మాల్, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లో పత్తి పంట దెబ్బతింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.