బీసీలను అణగదొక్కేందుకు ప్రభుత్వాల కుట్ర

ABN , First Publish Date - 2022-11-30T00:16:05+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కేందుకు కుట్ర పన్నుతున్నాయని ప్రజాసంఘాల నాయకులు అన్నారు.

బీసీలను అణగదొక్కేందుకు ప్రభుత్వాల కుట్ర

కొడంగల్‌, నవంబరు 29: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కేందుకు కుట్ర పన్నుతున్నాయని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఈమేరకు పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మంగళవారం కొడంగల్‌లోని అంబేడ్కర్‌ చౌరస్తాలో భారత్‌ ముక్తి, మోర్చా, బహుజన్‌, క్రాంతి మోర్చా సంఘాల నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కులాలవారీగా గణాంకాలు చేపట్టి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో 70 కోట్ల జనాభా కలిగిన బీసీలకు కులాలవారీగా గణాంకాలు చేపట్టని పక్షంలో దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందన్నారు. లంబాడా హక్కుల పోరాట సమితి, అంబేడ్కర్‌ సంఘం, బీఎస్పీ, బీసీ సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హక్కుల పోరాట సమితి, తదితర ప్రజాసంఘాల నాయకులు సూర్యనాయక్‌, యు.రమేశ్‌బాబు, బీమారాజు, డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, కొత్తూర్‌ చంద్రయ్య, అడ్వొకేట్‌ వెంకటయ్య, అరుణ్‌నాయక్‌, కేశవులు, రాములు, శ్రీనివాస్‌, చెన్నయ్య, సాయిలు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:16:06+05:30 IST