ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-12-10T00:13:51+05:30 IST

ఆమనగల్లు పట్టణంలో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మండ్లీ రాములు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ఆమనగల్లు: కేక్‌కట్‌ చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌

ఆమనగల్లు/కడ్తాల్‌/షాద్‌నగర్‌ అర్బన్‌/చౌదరిగూడ/యాచారం/చేవెళ్ల/షాబాద్‌/కందుకూరు/కొత్తూర్‌, డిసెంబరు 9: ఆమనగల్లు పట్టణంలో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మండ్లీ రాములు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివా్‌సరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కేక్‌కట్‌ చేశారు. అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సోనియాగాంధీ వల్లే తెలంగాణ స్వరాష్ట్రం కల నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.ఏ ఖలీల్‌, రాములు, కృష్ణనాయక్‌, వస్పుల శ్రీశైలం, అలీం, రాఘవేందర్‌, రాజు, వస్పుల శ్రీకాంత్‌, ఫరీద్‌, బాబా పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల మండల కేంద్రంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్‌ పార్టీ మండల అద్యక్షుడు యాట నర్సింహ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నేనావత్‌ బీక్యానాయక్‌, పార్టీ శ్రేణులతో కలిసి నర్సింహ కేక్‌కట్‌ చేశారు. సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేగూరి వెంకటేశ్‌, బీచ్యనాయక్‌, జహంగీర్‌బాబా, పూల శంకర్‌, నంద్యనాయక్‌, శంకర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ కేక్‌ను కట్‌ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీ పండ్లు, బ్రేడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బాల్‌రాజ్‌గౌడ్‌, ఆశన్నగౌడ్‌, కె. పురుషోత్తంరెడ్డి, కె. చెన్నయ్య, అందె మోహన్‌, నలమోని శ్రీధర్‌, ఖదీర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా చౌదరిగూడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజనర్సింహారెడ్డి, అశోక్‌, అంజనేయులు, వెంకట్‌రాములు, నర్సింలు, వేణుగోపాల్‌ పాల్గొన్నారు. అదేవిధంగా యాచారం మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు కె.శ్రీనివా్‌సరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఎం.నర్సింహ, నాయకులు అరవింద్‌ నాయక్‌, ఎండీ అక్బర్‌, ఎం.శ్రీశైలం, ఎం.సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్ల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌, మండల ప్రధాన కార్యదర్శి గుండాల రాములు కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్‌రెడ్డి, పెంటయ్య గౌడ్‌, పాండు, సత్యానారయణ, గోపాల్‌రెడ్డి, బాలయ్య, యాదయ్య, పడాల రాములు, జనార్దన్‌, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌ మండలంలోని చందన్‌వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు డీసీసీ ప్రధాన కార్యదర్శి పామెన భార్గవరాం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అక్తర్‌పాషా, ఆనందు, బండిప్రభాకర్‌, శివకుమార్‌, రాములు, లింగం పాల్గొన్నారు. అదేవిధంగా కందుకూరు మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎస్‌.కృష్ణానాయక్‌ ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దెబ్బడగూడ సర్పంచ్‌ శ్రావణి, నాయకులు కె. రాణాప్రతా్‌పరెడ్డి, ఎస్‌డీ. అజీజ్‌, సల్మాన్‌, భూపాల్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వినోద్‌చారి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ షాద్‌నగర్‌ నియోజకవర్గం సీనియర్‌ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థుల మధ్య కేక్‌ను కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలరు మాదారం నర్సింహాగౌడ్‌, సోమ్లనాయక్‌, నాయకులు కె. సురేందర్‌, జె. శ్రీను, గోపాల్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:13:52+05:30 IST