అడవిలో మద్యం సేవించిన వ్యక్తులపై కేసు
ABN , First Publish Date - 2022-05-30T05:45:27+05:30 IST
అడవిలో మద్యం సేవించిన వ్యక్తులపై కేసు
వికారాబాద్, మే 29 : అనంతగిరి అడవుల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఆదివారం అనంతగిరి అడవుల్లో పెట్రోలింగ్ చేస్తుండగా హైదారాబాద్కు చెందిన ఆరుగురు వ్యక్తులు మద్యం సేవిస్తూ కనిపించారు. దీంతో పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగిందని సీఐ తెలిపారు.