కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2022-08-15T05:58:14+05:30 IST

కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు

కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు

శంషాబాద్‌, ఆగస్టు 14: మండలం పరిధి తొండిపల్లి వద్ద హైద రాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై గల బ్రిడ్జి వద్ద ఆదివారం సా యంత్రం కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారు బోల్తాతో 3కిలో మీటర్లమేర ట్రాఫిక్‌ జాం అయ్యి వాహన దారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్‌తో కారును పక్కకు తొలగించారు.

Updated Date - 2022-08-15T05:58:14+05:30 IST