మద్యం మత్తులో ఇళ్లలో చొరబడి చోరీ

ABN , First Publish Date - 2022-12-10T00:21:15+05:30 IST

మద్యం మత్తులో ఉన్న యువకులు ఇళ్లలోకి చొరబడి సెల్‌ఫోన్‌లు చోరీ చేశారు.

మద్యం మత్తులో ఇళ్లలో చొరబడి చోరీ

మొయినాబాద్‌, డిసెంబరు 9: మద్యం మత్తులో ఉన్న యువకులు ఇళ్లలోకి చొరబడి సెల్‌ఫోన్‌లు చోరీ చేశారు. నిద్రిస్తున్న ఓ వ్యక్తి మెడలోంచి బంగారు గొలుసు తీస్తుండగా ఓ దొంగను పట్టుకోగా మరో ఇద్దరు పరారయ్యారు. ఈ ఘటన మండల పరిదిలోని చిలుకూరు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చిలుకూరు గ్రామానికి చెందిన యువకుడు మహేష్‌ మరోఇద్దరు యువకులతో కలిసి గురువారం రాత్రి 2గంటల సమయంలో నాలుగు ఇళ్లలో చొరబడి సెల్‌ఫోన్‌లు దొంగిలించారు. అదే సమయంలో ఆకుల శ్రీకాంత్‌ ఇంట్లో నిద్రిస్తుండగా అతడి మెడలో నుంచి బంగారు గొలుసు దొంగిలించేందుకు ప్రయత్నించాడు. శ్రీకాంత్‌కు మేలుకువ కావడంతో మహే్‌షను పట్టుకున్నాడు. మిగితా ఇద్దరు పారిపోయారు. పట్టుబడిన మహే్‌షకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు మహే్‌షను అదుపులోకి తీసుకొని అతని వద్దనుంచి నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-10T00:21:16+05:30 IST