రోడ్లు బంద్ చేసి బతుకమ్మ సంబరాలు సరికాదు
ABN , First Publish Date - 2022-10-02T05:40:04+05:30 IST
రోడ్లు బంద్ చేసి బతుకమ్మ సంబరాలు సరికాదు
- డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి
రంగారెడ్డి అర్బన్, అక్టోబరు 1: రోడ్లు బ్లాక్చేసి రాకపోకలను నిలిపేసి బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఏమిటని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ప్రశ్నించారు. శనివారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లెలగూడ బతుమ్మ ఘాట్ వద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహించతో ఐదు గ్రామాలు, వందకుపైగా కాలనీల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పాడ్డాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లేలగూడ వద్ద కాంగ్రెస్ అధ్వర్యంలో ధర్నా చేశారు. బతుమ్మ సంబరాలు చేసుకోవడం మంచిదే కానీ.. రోడ్లు బందు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. ధర్నాలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల వెంకటేష్, మీర్పేట్ కార్పొరేటర్లు చల్లా బాల్రెడ్డి, సిద్ధాల శ్రీశైలం, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆళ్ల శ్రీనివా్సరెడ్డి, నాయకులు కీసర యాదిరెడ్డి, చల్లా ప్రభాకర్రెడ్డి, విజయవర్ధన్రెడ్డి, సుభా్షరెడ్డి, కొండల్ యాదవ్, యూసూఫ్ పాల్గొన్నారు.