బెల్టు షాపులను తొలగించాలి
ABN , First Publish Date - 2022-12-06T23:27:25+05:30 IST
జిల్లాలో గల్లీగల్లీకి వెలిసిన బెల్టుషాపులను వెంటనే మూసివేయించాలని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అధికారులను ఆదేశించారు.
అధికారులతో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 6: జిల్లాలో గల్లీగల్లీకి వెలిసిన బెల్టుషాపులను వెంటనే మూసివేయించాలని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళశారం జడ్పీ స్థాయీసంఘాల సమావేశాలను జడ్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం అంశాలపై చర్చించారు. జిల్లా పరిశ్రమల శాఖ నుంచి మహిళా సంఘాలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.కోటి ఇస్తున్నట్లు చైర్పర్సన్ పేర్కొన్నారు. జిల్లాకు కొత్తగా 9పీహెచ్సీలు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు తన్వీరాజు, జంగమ్మ, వెంకట్రాంరెడ్డి, శ్రీలత, మహిపాల్, కోఆప్షన్ సభ్యులు అలీ అక్బర్ఖాన్, సీఈవో దిలీ్పకుమార్, డిప్యుటీ సీఈవో రంగారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.