కనుల పండువగా అయ్యప్ప రథోత్సవం

ABN , First Publish Date - 2022-11-27T23:56:44+05:30 IST

తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయ 27వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

కనుల పండువగా అయ్యప్ప రథోత్సవం
తాండూరులో అయ్యప్ప స్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తున్న భక్తులు

తాండూరు, నవంబరు 27: తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయ 27వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకీ సేవను గ్రీన్‌సిటీ, పాత తాండూరు, మార్వాడీ బజార్‌, ఇందిరా చౌక్‌, బస్టాండ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భజన, కీర్తనల మధ్య స్వామి వారి రథోత్సవం కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థినులు, మాలధారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆలయంలో 18మెట్ల పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సంఘం అధ్యక్షుడు వెంకట్‌రా వు, ప్రధాన కార్యదర్శి కేశ వరెడ్డి, జైపాల్‌రెడ్డి, బస్వరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:56:45+05:30 IST