సీజ్చేసిన వాహనాలకు రేపు వేలం
ABN , First Publish Date - 2022-07-19T05:13:26+05:30 IST
సీజ్చేసిన వాహనాలకు రేపు వేలం
ఆమనగల్లు, జూలై 18: ఆమనగల్లు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో నాటుసారా రవాణా చేస్తూ పట్టుబడి సీజ్చేసిన ద్విచక్ర వాహనాలకు బుధవారం(రేపు) వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10గంటల నుంచి వేలం కొనసాగుతుందని తెలిపారు.