అత్వెల్లి శివాలయం, ఎల్లమ్మ ఆలయాల్లో చోరీ

ABN , First Publish Date - 2022-05-19T05:25:07+05:30 IST

అత్వెల్లి శివాలయం, ఎల్లమ్మ ఆలయాల్లో చోరీ

అత్వెల్లి శివాలయం, ఎల్లమ్మ ఆలయాల్లో చోరీ

మేడ్చల్‌, మే 18 : మేడ్చల్‌ మున్సిపల్‌ అత్వెల్లి శివాలయం, ఎల్లమ్మ ఆలయాల్లో చోరీ జరిగింది. ఆలయాల్లోని హుండీలను మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 6నెలల నుంచి హుండీలు తెరువలేదని ఆలయ పండితుడు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-19T05:25:07+05:30 IST